Current Date: 05 Oct, 2024

టీడీపీ కార్యాలయంలో కోలాహలం

టీడీపీ అధినేత చంద్రబాబు మే 13న పోలింగ్‌ జరిగిన తర్వాత తొలిసారిగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అధినేత రాకతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. ‘‘సీఎం, సీఎం...’’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో టీడీపీ ఆఫీసు ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో, పార్టీ కార్యాలయంలో ఉండి పని చేసిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.