Current Date: 02 Jul, 2024

అవార్డు దక్కిన రోజుల వ్యవధిలో కూలిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ట్యాక్సీలతో సహా కార్లపై పైకప్పు పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.నిజానికి ఢిల్లీ విమానాశ్రయానికి ఇటీవల బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా అవార్డు వచ్చింది. దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా టైటిల్‌ను ఢిల్లీ కైవసం చేసుకుంది. అలానే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టాప్‌ 50లో ఒకటిగా ఢిల్లీ నిలిచింది. కానీ..ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న రోజుల వ్యవధిలోనే పైకప్పు కూలడం గమనార్హం.రూఫ్ షీట్ తో పాటు సపోర్ట్ బీమ్స్ కూడా కూలిపోవడంతో టెర్మినల్ లోని పికప్ అండ్ డ్రాప్ ఏరియాలో పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Share