Current Date: 04 Jul, 2024

రేపే ఎన్నికల కౌంటింగ్... నేడు ఈసీ కీలక ప్రెస్‌మీట్....

లోక్‌సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే  జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కౌంటింగ్‌కు ముందు రోజైన నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జూన్ 3న మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్‌మీట్ నిర్వహించేవారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత, కౌంటింగ్‌కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది.