Current Date: 07 Oct, 2024

నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగి దొరికిన నగలు రిటర్న్!

కర్ణాటకలో ఓ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయతీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న విలువైన బంగారు నగలు, నగదుతో కూడిన బ్యాగును తిరిగి ఆమెకుఅప్పగించిప్రశంసలుఅందుకున్నారు.రాష్ట్రంలోనిహగరిబొమ్మనహళ్లిలోసోమవారంఈఘటనచోటుచేసుకుంది.హగరిబొమ్మనహళ్లికి చెందిన మైమున్నీసా బేగం అనే మహిళ సోమవారం హొసపేటె‌లో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సును ఎక్కారు. ఈ క్రమంలో గమ్యస్థానానికి చేరిన తర్వాత హడావుడిగా బస్సు దిగుతూ అందులో బంగారు నగలు ఉన్న తన బ్యాగును మరిచిపోయారు. ఈ విషయం బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ కూడా గమనించలేదు. నేరుగా బస్సు డిపోకు చేరుకోగా అక్కడ విధుల్లో ఉన్న మారుతి అనే ఉద్యోగి బస్సును శుభ్రం చేస్తుండగా బ్యాగు కనిపించింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా బంగారు నగలు, డబ్బు కనిపించాయి.నిజాయతీ గల ఆ ఉద్యోగి వెంటనే.. ఆ బ్యాగును వెంటనే డిపో మేనేజర్‌కు మారుతి అప్పగించారు. అందులోని ఓటరు కార్డు ఆధారంగా ప్రయాణికురాలి మైమున్నీషా బేగం చిరుమానా ఇవ్వగా అప్పటికే తన బ్యాగులో రూ.4 లక్షల విలువైన నగలు చేజారిపోయాయని బాధలో ఉన్న ఆమె పట్టరాని సంతోషానికి గురయ్యారు. 

Share