Current Date: 05 Oct, 2024

నోరుజారి చిక్కుల్లో పడిన వేణుస్వామి

ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగచైతన్య,  శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. శుభమా అని.. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. వేణుస్వామి తీరుపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కోరారు. ఈ మధ్యకాలంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు కొన్ని బెడిసికొట్టడంతో ఇకపై హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు, రాజకీయాలకి సంబంధించి జాతకాలు చెప్పనని శపథం చేశారు. కానీ, నాగచైతన్య - శోభిత నిశ్చితార్థం జరిగిన కొన్ని గంటల్లోని వాళ్ల పెటాకులు అవుతుందంటూ జాతకం చెప్పేశారు. ఇదెందుకు చెప్పావయ్యా అంటే.. గతంలో నాగచైతన్య-సమంత పెళ్లి జరిగినప్పుడు జాతకం చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇది కూడా చెప్పాను అంటున్నారు.

Share