Current Date: 05 Oct, 2024

రైతుల కోసం రూ. 674 కోట్లు

వైసీపీ ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “కష్టకాలంలో ఉన్నా గత నెలలో రూ.వెయ్యి కోట్ల బకాయిలను రైతులకు విడుదల చేశాం.రైతుల శ్రేయస్సు కోసం  ఈ రోజు రూ.674 కోట్లు చెల్లించడం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం” అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

Share