Current Date: 05 Oct, 2024

విశాఖ కలక్టరేట్‌ చరిత్రలో ‘మలి’నం

అసైన్డ్‌ భూములకు ఫ్రీ హోల్డ్‌ కల్పించే విషయంలో ఇన్‌సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందని చెప్పడానికి అవసరమైన ఆధారాలను ‘లీడర్‌’ సంపాదించింది. ఉత్తర్వులు ఇవ్వడానికి కలెక్టర్‌ మల్లికార్జునతో ఒప్పందాలు చేసుకున్న తరువాతనే దళారీలు అసైన్డ్‌ భూములను కారు చౌకగా కొనుగోలు చేశారు. కలెక్టర్‌ మల్లికార్జున ఢీ నోటిఫై చేసిన అసైన్డ్‌ భూములన్నీ ఒకే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్‌లు జరగడమే ఇందుకు సాక్ష్యం. ఆనందపురం మండలంలోని గండిగుండం గ్రామంలో కలెక్టర్‌ మల్లికార్జున ఢీ నోటిఫై చేసిన భూములన్నిటినీ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, మానికొండ గ్రామానికి చెందిన కలకొండ భరత్‌ సుభాష్‌ పేరుమీదనే రిజిస్ట్రేషన్లు జరిగాయని ‘లీడర్‌’ పరిశోధనలో తేలింది.