Current Date: 04 Jul, 2024

యోగా ప్రాధాన్యత తెలుసుకుందాం

యోగా ప్రాధాన్యతను తెలుసుకుని ఆరోగ్య విశాఖను నిర్మిద్దామంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా యంత్రాంగం, ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ జిల్లా జేసి కె. మయూర్ 1 అశోక్, విడిసీ కె.ఎస్. విశ్వనాథన్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు యోగాసనాలు ప్రదర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల ప్రభావంరోజు రోజుకూ ఎక్కువై పోతుందన్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యతనిస్తూ రోజువారీ దినచర్యగా పాటించాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. మాట్లాడుతూ ఆరోగ్య విశాఖ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేచురోపతి వైద్యులు డా. టి. తులసీరావు అందరి చేతా యోగాసనాలు వేయించారు. బ్రహ్మకుమారి శివలీల ధ్యానం ప్రాధాన్యతను చెబుతూనే అందరితోనూ కాసేపు ధ్యానం చేయించారు. 

Share