Current Date: 05 Oct, 2024

కేంద్రానికి చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి..

ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి కేంద్రానికి ఇదే సరైన సమయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మురళీనగర్ మెయిన్ రోడ్డులోని  ఆహ్వాన ఫంక్షన్ హలులో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో  రాష్ట్రములో అంబాని, అదానీకి ఎంత దోచు పెట్టారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించిన అంశాలు మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు మీద ప్రజా పోరాటాల చేసేది వామ పక్షాలు మాత్రమే అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం సరికాదని, ప్రైవేటీకరణలో భాగమే ఇది అని స్పష్టం చేశారు. 

Share