Current Date: 06 Jul, 2024

4న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం   విజయవాడ విమానాశ్రయం నుంచి ఢల్లీకి బయలుదేరి  వెళుతున్నారు. రాత్రికి అక్కడే బసచేసి గురువారం ఉదయం ప్రధానితో పాటు అనేక మంది కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.  హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను  చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం,  పారిశ్రామిక రాయితీలు   వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు.

Share