Current Date: 05 Oct, 2024

నేటి నుంచి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్లు

రాష్ట్రంలో అసెంబ్లీ వేడి నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ ప‌డుతున్న రాజ‌కీయ పార్టీల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాద‌వ్ వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికీ రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న రాజీనామాను అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూట‌మి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. అలాగే త‌మ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవ‌డానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా ర‌చ‌న చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్రాలో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి బొత్స స‌త్యన్నారాయ‌ణను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

Share