Current Date: 07 Oct, 2024

బాలికను చంపిన ప్రేమోన్మాది ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెం గ్రామాన్ని చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని దర్శిని ని దారుణంగా హతమార్చిన నిందితుడు అదే గ్రామానికి చెందిన సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివా రులో గురువారం అతడి మృతదేహాన్ని పోలీ సులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హత మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభు త్వం విచారణకు ఆదేశించటంతో పాటు నింది తుడి అచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు నిజరానగా అందజేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గోడ పత్రికలు ముద్రించి ప్రధాన నగరాల్లో ప్రకటనలు వేశా రు. దీంతో నిందితుడు ఎటు వెళ్లలేని స్థితిలో చేసేది లేక ఆత్మహత్య కు పాల్పడిన చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఏమయినా గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్న యువత క్షణికావేశంలో తీసుకుంటున్న ఘోర మైన నిర్ణయాలతో ఉసురు తీసుకుంటూ, వారి తల్లిదండ్రులకు తీరని మనోవేదన కలిగి స్తుండటం బాధాకరం.

Share