Current Date: 07 Oct, 2024

కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదలశాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ సగిలి ఆధ్వర్యంలో  జరిగిన సమావేశంలో ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.

Share