Current Date: 27 Sep, 2024

కోరుకొండ సైనిక స్కూల్‌ విద్యార్థులతో వెంకయ్యనాయుడు

విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్‌ స్కూల్‌ ను గురువారం   పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు  సందర్శించాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరమని   అన్నారు. కెప్టెన్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రితో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, వారిలో కనిపిస్తున్న క్రమశిక్షణ   ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. భవిష్యత్తులో భారత సైన్యంలో చేరి సేవలందించాలనుకునే విద్యార్థులకు ఇక్కడ అందిస్తున్న శిక్షణ అత్యుత్తమమని కితాబిచ్చారు.

Share