Current Date: 27 Sep, 2024

పార్లమెంటరీ కమిటీలో ఎంపీ కంగనాకు చోటు

తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన కంగనా రనౌత్ కు పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కమిటీలో కంగనా పేరును చేర్చారు. ఈమేరకు పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ కమిటీలో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మరోసారి చోటు దక్కింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు కమిటీల సారథ్య బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

Share