Current Date: 27 Sep, 2024

తిరుమల లడ్డూ వివాదం అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యం పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే స్వామికి నైవేద్యం పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో బయటి వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని, తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే జరిపించాలని కోరారు. అలా తయారుచేసిన ప్రసాదాలను మాత్రమే దేవుళ్లకు సమర్పించాలని డిమాండ్ చేశారు

Share