Current Date: 27 Sep, 2024

జమ్మూ కుర్రాడు రూ.కోటి గెలిచేశాడు!

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ)   పరిచయం అక్కర్లేని టీవీ షో ఇది. ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 16వ సీజన్‌ నడుస్తోంది. ఇందులో జమ్మూకశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు చందర్‌ ప్రకాశ్‌   సంచలనం సృష్టించాడు. ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ ఇతడే కావడం విశేషం. అయితే రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్‌ చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. దానికి సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు. వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అతడిని అభినందించారు. అమితాబ్‌ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రూ.కోటితో పాటు అతడు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.

Share