Current Date: 07 Oct, 2024

అన్న ప్రసాదాల తయారీలో మార్పులు అవాస్తవం టీటీడీ ఈవో స్పష్టీకరణ

తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త పూర్తిగా అసత్యమని టీటీడీ ఈవో జె.శ్యామలరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే సాధానణ బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని,  అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించాం తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.  అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారు.   ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Share