Current Date: 07 Oct, 2024

హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోటీసులు

హీరో రాజ్ తరుణ్‌కు  నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రా,మయాంక్ మల్హోత్రాల పైనా కేసు నమోదు అయ్యింది.

Share