Current Date: 07 Oct, 2024

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం కేంద్ర ఆర్ధికమంత్రికి చంద్రబాబు వినతి

ఢల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. అంతకుముందు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు.  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో, కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు.

Share