Current Date: 06 Oct, 2024

భారత్-కెనడా మ్యాచ్ రద్దు నేపథ్యంలో ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ వరల్డ్ కప్ 2024పై వరుణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో జరగాల్సిన మ్యాచ్‌లు అనూహ్యంగా రద్దు అయ్యాయి. ఈ విధంగా కీలక మ్యాచ్‌లు రద్దవడం పట్ల బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఐసీసీపై విమర్శలు గుప్పించారు. గ్రౌండ్ మొత్తాన్ని కప్పి ఉంచగలిగే కవర్స్ లేని మైదానాలకు ఆతిథ్యం అవకాశం ఇవ్వొద్దని ఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పిచ్‌ను కవర్ చేయలేరు. మైదానంలోని ఇతర భాగాలు కూడా తడిసిపోకుండా అడ్డుకోలేరు. స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూడాలని చాలా మంది వేచిచూశారు. కానీ అలా జరగలేదని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Share