Current Date: 06 Oct, 2024

ఐదేళ్ల సైకో జగన్‌ పాలన పోయింది

ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి, పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయక రావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అనితకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా స్థానిక పాండురంగస్వామి ఆలయంలో అనితతో పాటు ఆమె కుమారుడు నిఖిల్‌, కుమార్తె రేస్మికలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎన్నికల్లో అందించిన అపూర్వ విజయాన్ని జీవితంలో మర్చిపోలేనన్నారు. ఇప్పటి వరకూ పాయకరావు పేటకు మంత్రి పదవి లేకపోవడం, ఇప్పుడు సీఎం చంద్రబాబు హోంమంత్రిగా తనకు అవకాశం ఇవ్వటం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. తనకు లభించింది పదవి కాదని బాధ్యత అని పేర్కొన్నారు. ఐదేళ్ల సైకో జగన్‌ పాలన పోయిందన్నారు. ఇకపై కార్యకర్తలందరూ బాధ్యతగా రాష్ట్ర అభివృద్ధికి సహకారాన్ని అందించాలని కోరారు. తదనంతరం కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ పాయకరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు అనితకు బ్రహ్మరథం పట్టారు.

Share