Current Date: 22 Sep, 2024

సింహగిరి నరహరి ఇక సెలవు డీ సీ సుజాత కి బాధ్యతలు అప్పగించిన శ్రీనివాసమూర్తి

సింహాచలం ఈఓ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ ఎస్ .శ్రీనివాసమూర్తి దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సుజాతకు అప్పగించారు. రెవెన్యూ శాఖ నుండి ఏడాది కాలం డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన సోమవారంతో తన పదవీ కాలం పూర్తికావడంతో చివరిసారిగా పవిత్రోత్సవాలు పూర్ణాహుతి వేడుకల్లో రాత్రి పాల్గొని తన సేవలను పరిపూర్ణ చేసుకున్నారు. మంగళవారం స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి డిసీ సుజాత కు బాధ్యతలను అప్పగిస్తూ అధికారిక పత్రల పై సంతకాలు చేశారు. ఈమె సింహాచలం ఈఓ గా ఇంచార్జీ బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వం నూతన ఈఓని నియమించిన వరకు ఈమె ఆ బాధ్యతల్లో ఉంటారు. కాగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు రాంబాబు సహాయ కార్య నిర్వహణ అధికారులు ఆనంద్ కుమార్, రాజేంద్ర కుమార్,  పిల్లా శ్రీనివాస్ , పర్యవేక్షణ అధికారి రమణ, పిఆర్ఓ నాయుడు  అర్చక స్వాములు ఉద్యోగులు ఆత్మీయ వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసమూర్తి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

Share