Current Date: 02 Jul, 2024

ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసిన టీమిండియా

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా జరిగింది. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా బార్బడోస్ బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. ఆటగాళ్లంతా అలసటతో ఉండడంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించిందని ఐసీసీ పేర్కొంది. ఇక భారత జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననుందని పేర్కొంది.

Share