Current Date: 07 Oct, 2024

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి

ఏపీలో అరాచక పాలన సాగుతోందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడి పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామని, 24న బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్‌ వెల్లడిరచారు.

Share