Current Date: 02 Jul, 2024

అధికారిక లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎస్‌ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి.. మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్‌ సమావేశాల కోసం ఢల్లీిలో ఉన్న డీఎస్‌ కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Share