Current Date: 07 Oct, 2024

బద్రీనాథ్ హైవే మూసివేత

బద్రీనాథ్ హైవే ను అధికారులు మూసివేశారు. దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు  చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోషి మఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. దీంతో అక్కడ దాదాపు 2వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణీకులను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Share