Current Date: 06 Jul, 2024

Kumari aunty is doing election campaign

కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆమె హైదరాబాద్‌లో ఫుడ్‌ వ్యాపారం చేసి సోషల్‌ మీడియాలో ఫుల్‌ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ఆమె రోడ్‌పై ఫుడ్‌ అమ్మడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి ఆమె ఫుడ్‌ వ్యాపారం చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌ పాపులారిటీ రావడంతో సెలబ్రిటీ అయిపోయింది. కుమారి ఆంటీ పలు సీరియల్స్‌, షోస్‌లో సందడి చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.
తాజాగా కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ సపోర్ట్‌ చేస్తూ 32, 31, 25, 21, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసింది. అంతేకాకుండా తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నట్లు తెలిపి ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో వాటిని చూసిన వారంతా షాక్‌ అవుతున్నారు. కాగా.. ఎన్నికలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఫుల్‌ బిజి బిజీగా ఉన్నారు. అన్ని పట్టణాల్లో, పల్లెల్లో ప్రచారం చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు.