Current Date: 04 Jul, 2024

బార్బడోస్‌లోనే చిక్కుకున్న టీమిండియా భారీ వరదలతో అక్కడి ఎయిర్‌ పోర్టు మూసివేత

టీ20 వరల్డ్‌కప్‌ గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు తుపాను కష్టాలు వచ్చిపడ్డాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు వేదికైన బార్బడోస్‌ లోనే భారత జట్టు చిక్కుకుపోయింది. అట్లాంటిక్‌లో ఏర్పడిన ‘బెరిల్‌’ తుపాను కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను తీవ్రతరం అవ్వడంతో బార్బడోస్‌ ఎయిర్‌ పోర్టుని కూడా మూసివేశారు. దీంతో, టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోయింది.   ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు తెలిపారు. తుఫాను తగ్గి పరిస్థితి సద్దుమణిగిన తర్వాతే టీమిండియా స్వదేశానికి రానుంది.

Share