Current Date: 04 Jul, 2024

కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్‌ కమిషన్‌ వ్యవహరిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.

Share