Current Date: 06 Oct, 2024

పగిలిన మంచులక్ష్మి పెదవి తొందరపాటు ఎంత పనిచేసింది?

అమెరికాలో చిల్ అవుతున్న మంచు లక్ష్మి సడన్‌గా మొహంపై ప్లాస్టర్‌తో దర్శనమిచ్చింది.  షూటింగ్‌లో ఏమైనా గాయం అయ్యిందేమో అని అంతా అనుకున్నారు. కానీ ట్యాబ్లెట్స్ కారణంగా అలెర్జీ వచ్చి ఆమె పెదవి పగిలిపోయిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా వెల్లడించారు.‘‘నేను మోతాదుకి మించి రెండు సాధారణమైన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంతే. నిమిషాల్లో నా పెదవి అలెర్జీ వల్ల పగిలిపోయింది. లక్కీగా నాతో పాటు అప్పుడు నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు. దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఇవ్వగలిగారు. లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అరచేతి మీద కూడా ఒక బంప్‌లా వచ్చేసింది. దీన్ని ఐసొలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు. ఇప్పుడు ఎలర్జీ తగ్గడానికి స్టరాయిడ్స్ తీసుకున్నాను’’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్‌కి తీసుకునే ట్యాబ్లెట్ మన బాడీకి పడకపోతే ఇలానే ఎలర్జీ వచ్చి చాలా మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బాడీకి ఏది పడుతుంది.. ఏది పడదు తెలుసుకునేందుకు ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి. ఇక ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది. కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Share