Current Date: 06 Oct, 2024

మాట నిలబెట్టుకున్న ఎంపీ మిధున్ రెడ్డి.. కారుని గిఫ్ట్‌

టీడీపీ దాడిలో ఏవైతే ధ్వంసం అయ్యాయో, వాటిని తాను తీయిస్తాన‌ని గతంలో ప్రకటించిన ఎంపీ మిధున్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు.  చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి కారును బ‌హూక‌రించారు. గ‌తంలో రెడ్డెప్ప ఆహ్వానం మేర‌కు మిధున్ రెడ్డి పుంగనూరు వెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు భారీ సంఖ్య‌లో రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంటిపై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. అలాగే రెడ్డెప్ప కారును కూడా త‌గుల‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప‌కు కొత్త కారును బ‌హూక‌రించ‌డంపై కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిధున్ లాగే ప్ర‌తి నాయ‌కుడు పార్టీ శ్రేణుల‌కు ధైర్యాన్ని క‌ల్పించాల్సిన అవ‌స‌రం వుంద‌ని అభిమానులు కోరుతున్నారు. అధికార కూట‌మి నుంచి ఎన్ని ఇబ్బందులెదురైనా పోరాడాల‌నే స్థైర్యాన్ని నింపితే సరిపోదని ఇలా చేతల్లో చూపించాలని కార్యకర్తలు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Share