Current Date: 07 Oct, 2024

హీరోయిన్ మనీషా కోయిరాలని ఏడిపించిన ఫొటోగ్రాఫర్

ఒక తరం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన మనీషా కొయిరాల కెరీర్ ఆరంభంలో ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొందట. బొంబాయి చిత్రంతో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఒక్కసారిగా నేషనల్ వైడ్‌ పాపులారిటీని సంపాదించుకుంది. కానీ.. 2012లో మనీషా తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.2014 తర్వాత క్యాన్సర్‌ నుంచి కోలుకున్న మనీషా మళ్లీ సినిమాలో నటించారు. హీరామండి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న వెబ్‌ సిరీస్‌లో నటించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీషా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.తొలినాళ్లలో ఫొటో షూట్ చేసే సమయంలో ఓ ఫొటోగ్రాఫర్‌ నన్ను తెగ పొగిడేవాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా బికినీ ధరించమని కోరాడు. అయితే నేను మాత్రం స్విమ్మింగ్‌ చేసే సమయంలోనే అలాంటి డ్రెస్‌లు వేసుకుంటానని.. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి డ్రెస్‌లు వేసుకోను అని చెప్పాను. దాంతో ఆ ఫొటో గ్రాఫర్‌ నన్ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  

 

Share