Current Date: 06 Jul, 2024

వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

బద్వేలు, న్యూస్‌లీడర్‌, మే 7 : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై బద్వేలు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డిపై షర్మిల విమర్శించే క్రమం వివేకా హత్య గురించి ప్రస్తావించారు. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమె ఏం మాట్లాడారనే విషయం ఈ వీడియోలో చూడవచ్చు.