Current Date: 07 Oct, 2024

ఈరోజు ఏపీకి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి

ఈరోజు ఏపీకి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మంగళగిరిలో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకల కోసం ఆయన కుమార్తె, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఏపీకి వస్తున్నారు.వైఎస్ జయంతి వేళ.. ఏపీకి, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఇప్పటికే సోనియా గాంధీ ఓ సందేశం పంపారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని సోనియా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏపీలో పర్యటించనుండటం ఇది రెండోసారి.ఎన్నికల ముంగిట విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షర్మిల కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం తాను ఇక ముందు కూడా ఆంధ్రాకు వస్తానని రేవంత్ తెలిపారు. ఇప్పుడు ఆయన మరోసారి తెలంగాణ సీఎం హోదాలో ఏపీకి వెళ్తున్నారు.

Share