Current Date: 07 Oct, 2024

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి జేఎన్‌టీయూలో పరిస్థితి ఇదీ

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. ఇవీ జేఎన్టీయూ కాలేజీ కేంటీన్లలో కనిపించిన దృశ్యాలు.. హైదరాబాద్‌ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న మంజీరా హాస్టల్‌ వంటశాలలో ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు యూనివర్సిటీ క్యాంటీన్లలో విద్యార్థులకు పెట్టే ఆహారంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Share