Current Date: 05 Oct, 2024

వైసీపీకు షాక్ ఇవ్వనున్న ఎంపీలు, రాజీనామా బాటలో ఆరుగురు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే ఏపీలో అధికారం కోల్పోయి నిరాశలో ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ పరిణామం చవిచూడనున్నారు. పార్టీ ఎంపీలు రాజీనామా బాటలో ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సొంత పార్టీ నేతలు జర్క్ ఇవ్వనున్నారు. కేంద్రంలో తమ పార్టీకు ఏది బలమని భావిస్తూ వస్తున్నారో అదే బలహీనం కానుంది. పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏకంగా ఆరుగురు రాజీనామా చేయనున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పటికే మార్గం సుగమం చేసుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజ్యసభలో 11 మంది సభ్యుల బలముంది. వీరిలో ఆరుగురు రాజీనామా చేస్తే ఆ బలం సగానికి తగ్గిపోనుంది. వైసీపీ బలాన్ని రాజ్యసభలో తగ్గించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రచిస్తోందని, అందులో భాగంగానే ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. రాజీనామా తరువాత తిరిగి తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వ పొందవచ్చు. ఆ అవకాశం లేకుంటే మరో రూపంలో ప్రయోజనం కల్పించనున్నారు. 

Share