Current Date: 05 Oct, 2024

భువనేశ్వరిపై నోరుజారిన వంశీ అరెస్ట్‌కి రంగం సిద్ధం?

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానిస్తూ మాట్లాడిన కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే కేసు మాత్రం వేరే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు. వంశీ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

Share