Current Date: 05 Oct, 2024

ఒలింపిక్స్ నుంచి సింధు ఔట్.. ఆశలు ఆవిరి

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని భారతీయులు గంపెడు ఆశలు పెట్టుకున్న పీవీ సింధు ఆరంభంలోనే ఇంటిబాట పట్టింది. కనీసం క్వార్టర్స్ చేరుకుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాట పట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన సింధు రెండో సెట్‌లో మరీ పేలవంగా చేతులెత్తేసింది. దాంతో హ్యాట్రిక్ మెడల్ ఆశ నీరుగారింది. తొలి సెట్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. రెండో సెట్‌లోనూ ఆరంభంలోనే 13-5తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిపోయిన చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో  సింధుని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టి సునాయాసంగా గెలిచేసింది. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో బిన్ జియావో‌ను ఓడించే సింధు కాంస్య పతకం గెలవడం గమనార్హం.

Share