Current Date: 31 Mar, 2025

ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం

మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ కారుకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఆమె నివాసం ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐశ్వర్య రాయ్ లగ్జరీ కారును బస్సు గుద్దిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. ఐశ్వర్య కారుకు ప్రమాదం జరిగింది అని వార్త తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె బాగానే ఉందని.. ఎవరూ కంగారు పడవద్దని ఐశ్వర్య సన్నిహితులు చెబుతున్నారు. ఐశ్వర్య రాయ్‌కు చెందిన ఐ ఎండ్ కారు వెనకగా ఓ బస్సు వచ్చింది. అయితే ఉన్నట్లుండి అది కారును ఢీ కొట్టింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ కారులో ఐశ్వర్య లేదని అధికారులు తెలిపారు. కారుకు కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని వెల్లడించారు. కారుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన వెంటనే జుహు తారా రోడ్డులోని అమితాబ్ బచ్చన్ బంగ్లాకు చెందిన బౌన్సర్ ఒకరు బయటకు వచ్చి.. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను కొట్టాడని అధికారులు వెల్లడించారు.

Share