Current Date: 06 Oct, 2024

ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీగా జలుమూరు వాసి ముద్దాడ రవిచంద్ర

 నరసన్నపేట నియోజక వర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీగా మరియు సీఎంఓ కార్యాలయం చీఫ్ గా నియమించారు. ముఖ్యమంత్రిగానారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ క్రమంలో సవిరిగాం వాసికి అరుదైన అవకాశం రావడంతో స్థానిక గ్రామంతో పాటు నరసన్నపేటలో పలువురు అభినందనలు తెలియజేశారు.

Share