Current Date: 07 Oct, 2024

వైసీపీ హయాంలో నమోదైన అక్రమ కేసుల ఎత్తివేత

వైఎస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేయడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ప్రారంభించారు. తెలుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఐదేళ్ల కాలంలో కేసులను ఎదుర్కొని ఎంతో మంది పార్టీ కోసం పోరాటం చేశారని వారందరిపై వీలైనంత త్వరగా కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఏం చేయాలో పార్టీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో వివరించి  పార్టీ కార్యాలయానికి పంపించాలని  సూచించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు  సరిగా స్పందించని పోలీసులు, ఇతర అధికారుల సమాచారం కూడా పంపాలని అన్నారు, అందరిపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందామని భరోసా ఇచ్చారు.

Share