Current Date: 04 Jul, 2024

పాయకరావుపేట ఎన్డీఎ అభ్యర్థిని వంగలపూడి అనిత వినూత్న ప్రచారం

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు చేపడుతున్న వినూత్న ప్రచా రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నా యి. ఇందులో భాగంగా పాయకరావుపేట నియో జకవర్గం ఎన్డీఏ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత ఈరోజు ఉపాధి కూలీలతో కలిసి వారిలో ఒకరిగా ఉపాధి పనులు చేపట్టారు. నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామంలో అనిత ఉపాధి కూలీలతో మమేకమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ .. గత ఐదేళ్లుగా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహ న్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కొన్నారని దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యే గా వున్నపుడు వందల కోట్ల రూపాయ లతో అనేక అభివృద్ధి పనులు చేపడితే, వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒక్క అభి వృద్ధి పని కూడా చేయలేకపోయారన్నారు. ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే టిడిపి కూటమి అధికారం లోనికి వచ్చిన వెంటనే అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకా లను అనిత వివరించారు. ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన , కూటమి ఎంపి అభ్యర్దిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని రైతులు, ఉపాధి కూలీలను అనిత అర్దించారు. ఈ కార్యక్రమంలో అనిత వెంట టిడిపి నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, గరికిన నూకరాజు, వాసుపల్లి సత్యం, జనసేన నాయకులు కందాల నాగరాజు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.