Current Date: 06 Oct, 2024

కూటమి నేతలపై చంద్రబాబు సీరియస్.. ఇక ఉపేక్షించనని వార్నింగ్

ఏపీలో గత కొన్ని రోజుల నుంచి కొందరు మంత్రులు, వారి సభ్యులు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు కూడా అధికార దర్పం ప్రదర్శిస్తూ వారి కుటుంబ సభ్యులను ఇన్‌వాల్వ్ చేస్తుండటంపై ఆగ్రహించారు. ఇకపై ఇలాంటివి సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు హద్దులు దాటుతున్నారని గుర్తు చేశారు. ఇకపై వివాదాలకు కారణమైతే స్వయంగా పిలిపించి మాట్లాడతానని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశం ఎజెండాలోని అంశాలు నిర్ణయానికి ముందే న్యూస్ ఛానళ్లలో రావడంపై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు.

Share