Current Date: 02 Jul, 2024

బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందింది. ఎవరు మెయిల్‌ చేశారనేదానిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బేగంపేట విమానశ్రయానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. విమానశ్రయం వైపు ఎవరినీ రానీయడం లేదు. నిజంగా బాంబు పెట్టారా లేదా ఎవరైనా ఆకతాయిలు మెయిల్‌ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Share