Current Date: 04 Jul, 2024

అసెంబ్లీకి జగన్ ఇక బై బై తప్పిదాలు దిద్దుకునే బాటలో యాత్ర!

మాజీ సీఎం వైయస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మళ్లీ శాసనసభకి వెళ్లే ఆలోచన లేదని పార్టీ నేతలు చెప్తున్నారు.వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత గత కొన్ని రోజులుగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మృతి చెందిన వారిని పరామర్శించాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు.పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం ఈ ఏడాది డిసెంబరు నుంచి ఓదార్పు యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ మేరకు ఈరోజు పులివెందులలో జగన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఐదేళ్లు జనంలో లేకుండా దెబ్బ తిన్న జగన్ఈ ఐదేళ్లు యాత్రల పేరుతో జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Share