Current Date: 04 Jul, 2024

వైసీపీ సోషల్ మీడియాలో ఫస్ట్ అరెస్ట్ నెరవేరిన మంత్రి అనిత పంతం

ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పై గతంలో అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నుంచి కదిరి వెళ్తున్న వర్రాని పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు.వైయస్ భారతి పీఏగా గతంలో పనిచేసిన వర్రా.. గత రెండేళ్ల నుంచి టీడీపీ, జనసేన మహిళా నేతలని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టాడు. ఈ మేరకు గతంలోనే అనిత పోలీసులకు ఫిర్యాదు చేసినా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వర్రా వేధింపులపై అనిత ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా అతను మారలేదు.అనిత మాత్రమే కాదు, టీడీపీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న ఉండవల్లి అనూష, గాయత్రితో పాటు జనసేన మహిళా నేత రుక్మిణిని సైతం టార్గెట్ చేస్తూ వర్రా పోస్టులు పెట్టాడు. దాంతో అందరూ అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు.

Share