Current Date: 02 Jul, 2024

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించాంటూ  విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీసీ ఛాఒంబర్‌ను, వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని, వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి.  వైసీపీ గెలుపుకోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Share