Current Date: 07 Oct, 2024

పోలీస్ ఎంక్వైరీకి హీరో రాజ్‌ తరుణ్ డుమ్మా.. అరెస్ట్ తప్పదా?

యంగ్ హీరో రాజ్ తరుణ్ మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారు. ప్రేమించి, పెళ్లి చేసుకుని వదిలేశాడంటూ అతనిపై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి విచారణ కోసం స్టేషన్‌కు రావాల్సిందిగా రాజ్ తరుణ్‌కి హైదరాబాద్ నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ అతను గురువారం విచారణకి హాజరవకుండా డుమ్మా కొట్టాడు. బిజీ షెడ్యూల్స్ కారణంగా తమ క్లయింట్ విచారణకు రాలేకపోయారని, మరికొన్ని రోజులు గడువు కావాలంటూ పోలీసులకు రాజ్ తరుణ్ లాయర్ లేఖ అందించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ప్రచారంతో పాటు, మిగతా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనని లాయర్ ద్వారా రాజ్ తరుణ్ కబురు పంపారు.ఈ నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి మరోసారి రాజ్ తరుణ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇదే నాన్చుడి ధోరణితో యంగ్ హీరో వ్యవహరిస్తే.. అరెస్టు చేసే అవకాశాలూ లేకపోలేదు

Share