Current Date: 07 Oct, 2024

కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ

 ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలెతోనూ ఆయన భేటీ కానున్నారు.  ఫిక్కీ ఛైర్మన్‌, ప్రతినిధులను కలవనున్నారు. భారత్‌లో జపాన్‌ రాయబారితో చర్చలు జరపనున్నారు. సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.

Share